బ్రెజిల్లోని మినాస్ జెరాయిస్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సావోపోలో నగరంలో ఉన్న బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు టైర్ ఒక్కటి ఊడిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, ఎదురుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టాడు. అనంతరం, పెద్ద గ్రానైటు రాయి కూడా బస్సు ఢీకొట్టింది.
పెను ప్రమాదం తప్పింది
ఈ ప్రమాద సమయంలో మరో కారు కూడా బస్సును ఢీకొట్టింది. అయితే, ఆ కారులో ఉన్న వారు క్షేమంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది తమ సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించటానికి సహాయం అందించారు.