సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనతో పాటు వ్యూహం సినిమా బృందం మరియు ఫైబర్ నెట్ మాజీ ఎండీకి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఆ నోటీసుల ప్రకారం.. రామ్గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా ప్రతి వ్యూకు రూ.100 చెల్లించే నిబంధనలకు విరుద్ధంగా.. వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ ద్వారా రూ.1.15 కోట్ల మేర అక్రమ లాభాలు పొందినట్లు ఆరోపించారు. నాటి ఫైబర్ నెట్ ఎండీతో సహా మొత్తం ఐదుగురిపై ఈ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
సినిమాకు కేవలం 1,863 వ్యూస్ మాత్రమే ఉన్నాయని, ఈ లెక్కన ఒక్కో వ్యూస్కు 11 వేల రూపాయల చొప్పున నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని వివరించారు. రూల్స్కు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.