ఇతర ఇండస్ట్రీల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ కారణంగా కేరళ ప్రేక్షకులపై పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రేమ కొంచెం తగ్గిందని తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ “ఎంపురన్2”లో కనిపించినప్పటికీ క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో పడింది. తర్వాత “విలయాత్ బుద్ద” సినిమా విడుదల అయ్యింది కానీ ప్రేక్షకుల దృష్టిలో నిలిచలేదు.
దీంతో పృధ్వీ ప్రస్తుతం సొంత గూటికి కొంచెం దూరంగా, వారణాసి, దైరా వంటి భారీ ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నాడు. “ద గోట్ లైఫ్” మరియు “గురుర్ అంబలనడయిల్” తరువాత సోలో హీరోగా తన హిట్ రికార్డులు సరిగ్గా నిలిచలేకపోయడం కూడా కేరళ ఆడియన్స్తో టచ్ తగ్గడానికి కారణం కావచ్చునని పరిశీలనలు చెబుతున్నాయి.
అయితే ఈ ఏడాది పృధ్వీ సొంత గూటికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసుకొస్తున్నాడు. నిషామ్ బషీర్ దర్శకత్వంలో రూపొందుతున్న “ఐ నోబడి” ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 20న ఖలీఫా ను రిలీజ్ చేయడానికి వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
అలాగే విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న “సంతోష్ ట్రోపీ” కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ ప్రేక్షకుల కోసం కరీనా కపూర్, మేఘనా గుల్జార్ కాంబోలో రూపొందుతున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ “దైరా” 2026లో రిలీజ్ అవుతుంది. మొత్తంగా పృధ్వీరాజ్ సౌత్ కూడా, నార్త్ కూడా ఆకట్టుకునే విధంగా తన మార్కెట్ విస్తరించడానికి సిద్దమవుతున్నాడు.







