టీ20 వరల్డ్కప్ 2026 (T20 World Cup 2026) నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం (Bangladesh Government) సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో టీ20 వరల్డ్కప్ మ్యాచ్లు నిర్వహించరాదు అని బోర్డు స్పష్టంగా ప్రకటించింది. ఢాకాలోని హోటల్ కాంటినెంటల్లో బంగ్లాదేశ్ క్రికెట్ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ (Asif Nazrul) సమావేశం నిర్వహించి, భారతదేశంలో భద్రతా పరిస్థితులు తగినంత స్థిరంగా లేనందున మ్యాచ్లు అక్కడే ఆడకూడదని నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం టీ20 వరల్డ్కప్ షెడ్యూల్పై పెద్ద ప్రభావం చూపనుంది.
ఇకపుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ను హెచ్చరించింది. భారత్లోనే వరల్డ్కప్ మ్యాచ్లు ఆడాలని ICC నిర్ణయించినప్పటికీ, భద్రతా కారణాలను పట్టుకుని బంగ్లాదేశ్ ఈ నిర్ణయాన్ని విస్మరించింది. ICC, బంగ్లాదేశ్ నిర్ణయంపై ఎలా స్పందించనుందో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం భవిష్యత్ టోర్నీ షెడ్యూల్ మరియు జట్ల ప్లానింగ్పై కీలక ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.








