భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనా పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రత్యేక ప్రాతినిధ్య చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చర్చలు గతంలో 2020కి ముందు న్యూఢిల్లీలో జరిగాయి.
గల్వాన్ వివాదం తరువాత పరిణామాలు
2020లో గల్వాన్ వివాదం తలెత్తిన తర్వాత, భారతదేశం, చైనాకు మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారాయి. కానీ ప్రస్తుతం సరిహద్దుల వద్ద యథాతథ స్థితి నెలకొనడం, సైనికుల ఉపసంహరణ పూర్తయ్యి, పరిస్థితి కొంత సద్దుమణిగింది.
బంగ్లా, మయన్మార్ అంతర్జాతీయ సంక్షోభాలు
ఈ ప్రత్యేక చర్చలు బంగ్లాదేశ్ మరియు మయన్మార్ లో జరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో మరింత కీలకంగా మారాయి.