ఇషాన్‌ కిషన్‌ ప్రపంచ రికార్డు

ఇషాన్‌ కిషన్‌ ప్రపంచ రికార్డు

Summarize with AI

టీమిండియా (Team India) యువ క్రికెటర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) టీ20 ఫార్మాట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy-2025)లో త్రిపుర (Tripura)తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (50 బంతుల్లో 113 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సెంచరీతో, టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ మూడు సెంచరీలు నమోదు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్, పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఈ డబుల్ రోల్‌లో రెండేసి సెంచరీలు మాత్రమే సాధించారు.

ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, కీపర్‌గా సాధించిన ఈ మూడో సెంచరీతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో లక్ష్య ఛేదనలో భాగంగా త్రిపుర నిర్దేశించిన 183 పరుగుల టార్గెట్‌ను జార్ఖండ్ 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్‌కు విరాట్ సింగ్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీతో అండగా నిలిచాడు. ఈ అసాధారణ ప్రదర్శనకు ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Join WhatsApp

Join Now

Leave a Comment