కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఢిల్లీలో హైకమాండ్తో సిద్ధరామయ్య మరియు డీకే.శివకుమార్ వర్గాలు కీలక చర్చలు జరిపాయి. ఈ రాజకీయ వేడి మధ్య, తాజా పరిణామంగా సిద్ధరామయ్య స్వయంగా డీకే.శివకుమార్ను శనివారం నాడు బెంగళూరులోని తన నివాసంలో బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించారు. ఇద్దరు అగ్రనేతలు కలిసి అల్పాహారం తీసుకున్నారు, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న కూడా వారితో ఉన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో తుది నిర్ణయం హైకమాండ్దేనని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. ఇదే విధంగా, హైకమాండ్ సూచనలను అంగీకరిస్తానని, ఢిల్లీకి పిలిస్తే వెళ్తానని డీకే.శివకుమార్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే, శనివారం మధ్యాహ్నం డీకే.శివకుమార్ ఢిల్లీ బయలుదేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో, కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.








“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు