మెడిక‌ల్ కాలేజీల PPP పద్ధతి ప్రజాహితానికి విరుద్ధం – బీవీ రాఘ‌వులు

మెడిక‌ల్ కాలేజీల PPP పద్ధతి ప్రజాహితానికి విరుద్ధం - బీవీ రాఘ‌వులు

ప్రభుత్వ విధానాలపై సిపిఎం (CPM) జాతీయ నాయకుడు బి.వి. రాఘవులు (B.V. Raghavulu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని, యజమానులకు అనుకూలంగా చట్టాలు చేయడం అన్యాయం అని విమర్శించారు. వీటికి నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (Medical Colleges) ప్రైవేటీకరణ (Privatization) చేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు అండగా ఉండాల్సి ఉండగా, ప్రైవేటుకు లాభం చేకూర్చే విధానాలే అమలు చేస్తున్నాయని రాఘవులు విమర్శించారు. PPP పద్ధతి ప్రజాహితానికి విరుద్ధమని, ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టులు నిర్మించి ప్రైవేటు వారికి అందించడం దారుణమని తెలిపారు. సంజీవని పథకంపై స్పష్టత ఇవ్వాలని, అది గేమ్ చెంజర్ అని చెప్పాలంటే ఎలా ప్రజలకు ఉపయోగపడుతుందో వివరించాలని కోరారు.

మావోయిస్టుల (Maoists) ఎన్‌కౌంటర్లను (Encounters) క్రూరత్వమని అన్నారు. ప్రజాస్వామ్యంలో విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించాలని, హత్యలు సమస్యలను మరింత క్లిష్టం చేస్తాయని వ్యాఖ్యానించారు.

ఏపీలో నిరుద్యోగం భారీగా పెరుగుతోందని, ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని రాఘవులు ఆరోపించారు. వందల కంపెనీలు వచ్చాయన్న ప్రచారం పచ్చి అబద్ధమని, డిన్నర్లు పెడితే పెట్టుబడులు రావని చెప్పారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టించడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తుచేశారు. వర్ణవివక్ష, సామాజిక అన్యాయాలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీలు బలంగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment