‘అమరన్’ తరువాత శివ కార్తికేయన్ నెక్స్ట్ టార్గెట్ ‘పరాశక్తి’!

'అమరన్' తరువాత శివ కార్తికేయన్ నెక్స్ట్ టార్గెట్ 'పరాశక్తి'!

Summarize with AI

‘అమరన్’తో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తర్వాత, శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) (SK) తన 25వ చిత్రం ‘పరాశక్తి’ (Parashakti) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara) మొదట ఈ ప్రాజెక్టును ‘సూర్య 43’ (Suriya 43) గా ప్రారంభించారు. కానీ, సూర్యతో క్రియేటివ్ విభేదాల కారణంగా ఆగిపోయిన ఈ కథ, ఇప్పుడు SK చేతికి వచ్చింది. ‘మదరాసి’ పరాజయం తర్వాత, శివ కార్తికేయన్, అలాగే హిందీ రీమేక్ ‘సర్ఫిరా’తో చేతులు కాల్చుకున్న సుధా కొంగరకు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం అత్యవసరం. సూర్య తప్పుకున్నందుకు పశ్చాత్తాపపడేలా చేయాల్సిన బాధ్యత సుధా కొంగరపై ఉంది.

ఈ సినిమా విజయం కేవలం SK మరియు సుధా కొంగరకే కాదు, మిగిలిన ప్రధాన బృందానికి కూడా కీలకం. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్న శ్రీలీల (Sreeleela)కు వరుస ప్లాపుల నుంచి బయటపడటానికి ఇది కీలకం కాగా, జీవీ ప్రకాష్ కుమార్‌కు ఇది 100వ చిత్రం కావడం విశేషం. నటుడు జయం రవి నెగెటివ్ షేడ్‌లో తన సత్తా నిరూపించుకోవాలి. ప్రధాన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ పెను సవాల్‌గా మారిన ఈ ‘పరాశక్తి’ చిత్రాన్ని 2026 సంక్రాంతికి భారీ పోటీ మధ్య విడుదల చేస్తున్నారు. ఈ మైల్‌స్టోన్ మూవీ అందరి ఆశలను నిలబెడుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment