జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత… సభకు అనుమతి రద్దు!

జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత… సభకు అనుమతి రద్దు!

జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గం పరిధిలోని బోరబండ (Borabanda)లో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) నిర్వహించాల్సిన మీటింగ్‌కు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో బీజేపీ(BJP) శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. పోలీసులు అనుమతి ఇచ్చి, చివరి నిమిషంలో రద్దు చేయడాన్ని బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జీ ధర్మారావు (Dharma Rao) ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ, సాయంత్రం బోరబండలోనే మీటింగ్ నిర్వహించి తీరుతామని బీజేపీ స్పష్టం చేస్తూ, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, సభకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ నాయకులు తెలిపారు.

జూబ్లీహిల్స్ ప్రచారంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
మరోవైపు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లిస్ తప్ప అన్ని పార్టీలు మారారని విమర్శించారు. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, అజారుద్దీన్‌కు సీటు ఇవ్వకపోవడం వంటి అంశాలపై రేవంత్ రెడ్డి చార్మినార్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎవరి చేతుల్లోనూ ఉండరని, వారి ఇష్టం ఉన్నవారికే ఓటు వేస్తారని, రేవంత్ రెడ్డి, కేసీఆర్ చేతుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. చివరగా, జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment