సినిమా రంగంలో, అన్ని ఇతర రంగాల్లో మాదిరిగానే, చాలా మంది మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ ఉన్నారు. నటుల్లోనే కాకుండా, నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్ (Nithya Menen) ఒకరు. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్న ఆమె వయసు ఇప్పుడు 37 ఏళ్లు, అంటే మరో మూడేళ్లలో 40కి చేరుకుంటారు. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ మలయాళీ భామ (Malayali Lady) బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెతలా ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ఆమె అద్భుత నటనకు గాను, ‘తిరుచిట్రంబలం (తిరు)’ (Thiruchitrambalam) చిత్రానికి(Film) జాతీయ ఉత్తమ నటి అవార్డు (Award) లభించింది.
తాజాగా, విజయ్ సేతుపతికి జంటగా నటించిన ‘తలైవన్ తలైవి’ చిత్రం విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న నిత్యామీనన్, ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ, తాను మూడు నెలల వయసు నుంచే తన బామ్మ వద్ద పెరిగానని, అలా చిన్న వయసులోనే ఒంటరితనం అలవాటు అయ్యిందని చెప్పారు. ప్రేమలో పడ్డ ప్రతిసారి అది సంతోషాన్ని కాకుండా బాధాకరమైన అనుభవాన్నే మిగిల్చిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం సినిమా జీవితంపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు ఆమె తెలిపారు.
అలాగని జీవితంలో పెళ్లే చేసుకోననే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆత్మార్థమైన ప్రేమ లభిస్తే అప్పుడు కచ్చితంగా పెళ్లి (Marriage) చేసుకుంటానని, అయితే ప్రస్తుతం తనకు ఈ సోలో లైఫే బెటర్గా ఉందని, ఈ జీవితాన్నే ఆస్వాదిస్తూ జీవిస్తున్నానని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా, తర్వాత ఆమె ధనుష్కు జంటగా నటించిన ‘ఇడ్లీ కడై’ చిత్రం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని గతంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంలో పెళ్లి జరిగినా, జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదన్నారు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని ఆమె క్లారిటీ ఇచ్చారు.