చిత్తూరు జిల్లా (Chittoor District)లో ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం (Kuppam) నియోజకవర్గంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల అప్పు తిరిగి చెల్లించలేదని తన కొడుకు ముందు ఓ మహిళ (Woman)ను చెట్టు (Tree)కు కట్టి కొట్టిన ఘటన మరువకముందే, శాంతిపురం మండలంలోని కర్లఘట్ట గ్రామం తమ్మిగానిపల్లి (Thammiganipalli)లో మరో మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ ఘటన సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరగడం, గతంలో ఇలాంటి ఘటనలు కూడా వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై స్థానికులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారని తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి అమానవీయ ఘటనలు చట్టం, శాంతిభద్రతల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కుప్పంలో మితిమీరిపోతున్న ఆగడాలు
— Telugu Feed (@Telugufeedsite) July 14, 2025
సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో మరో అమానవీయ ఘటన
మహిళను కరెంట్ పోల్కు కట్టేసిన వీడియో వైరల్
శాంతిపురం మండలం కర్లగట్టు పంచాయతీ తమ్మిగానిపల్లి గ్రామంలో భూ వివాదములతో ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం.. పూర్తి వివరాలు… https://t.co/v9MCSFYjBm pic.twitter.com/HwYmPTKbam








