వైసీపీ (YSRCP)కి చెందిన కీలక నేత, మాజీ ఎంపీ (FormerMP) నందిగం సురేష్ (Nandigam Suresh) గుంటూరు జిల్లా (Guntur District) జైలు(Jail)లో అస్వస్థతకు (Illness) గురయ్యారు. అధికారులు వెంటనే అప్రమత్తమై, ఆయనను అంబులెన్స్ (Ambulance)లో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)కి తరలించారు. వీల్చైర్ (Weelchair) సాయంతో ఆసుపత్రిలో చేర్పించారు.
విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోగా, పోలీసులు వారిని కలవడానికి అనుమతించలేదన్న సమాచారం. డాక్టర్లు (Doctors) ప్రస్తుతం సురేష్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.
ఇటీవల కోర్టులో వేసిన పిటిషన్
తాజాగా నందిగం సురేష్ తరఫున న్యాయవాది మంగళగిరి కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. లాకప్లో దోమల కారణంగా నిద్రలేమి, ఫ్యాన్ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, అలాగే మానసిక ఒత్తిడి కలిగించే ప్రశ్నలు అడుగుతున్నారని అభ్యంతరం తెలిపారు. టేబుల్ ఫ్యాన్, దోమల చక్రాల ఏర్పాటు కోసం అనుమతి కోరగా, కోర్టు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నందిగం సురేష్ టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడి కేసులో జైల్లో ఉన్నారు.
ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.