ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ICC Women’s ODI Batting Rankings)లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుతమైన సత్తా చాటింది. తాజాగా ఐసీసీ(ICC) ప్రకటించిన ర్యాకింగ్స్లో మంధాన తన ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ, తిరిగి అగ్రస్ధానా (No.1 Position)న్ని కైవసం చేసుకుంది. ఇటీవల శ్రీలంక (Sri Lanka), దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన ముక్కోణపు సిరీస్లో కనబరిచిన అద్భుత ప్రదర్శన మంధానను తిరిగి టాప్ ర్యాంక్ (Top Rank)కు చేర్చింది.
మంధాన నెం.1 ర్యాంకింగ్ వివరాలు
ప్రస్తుతం మంధాన 727 రేటింగ్ పాయింట్లతో నెం.1 ర్యాంక్లో కొనసాగుతోంది. ఆమె తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) మరియు ఇంగ్లండ్ సారథి నాట్ స్కైవర్-బ్రంట్ (Nat Sciver-Brunt) 719 రేటింగ్ పాయింట్లతో రెండో స్దానంలో సంయుక్తంగా ఉన్నారు.
మంధాన అసాధారణ ప్రదర్శన
స్మృతి మంధాన గతేడాది అసాధారణ ప్రదర్శన కనబరిచింది. 2024 ఏడాదికి గానూ ఆమె ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. గతేడాదిలో 13 మ్యాచ్లలో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది, ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఒకే క్యాలెండర్ ఈయర్లో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా మంధాన రికార్డులకెక్కింది. ఈ స్టార్ ఓపెనర్ ప్రస్తుతం ఇంగ్లండ్తో జరగనున్న సిరీస్కు సన్నదమవుతోంది. వన్డే వరల్డ్కప్-2025 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
ఇంగ్లండ్ పర్యటనకు భారత మహిళా జట్టు:
భారత మహిళల వన్డే జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హస్బానిస్, దీప్తి శర్మ, స్నేహా రాణా, శ్రీ చరణి, పూజా వస్త్రకార్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.
టీ20 సిరీస్కు భారత మహిళల జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహా రాణా, రాధా యాదవ్, మిన్ను మణి, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.