ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. డీజీపీకి చెవిరెడ్డి గ‌న్‌మెన్ లేఖ‌

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. డీజీపీకి చెవిరెడ్డి గ‌న్‌మెన్ లేఖ‌

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని లిక్కర్ కేసు (Liquor Case) విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారుల (SIT Officers) చ‌ర్య‌పై హెడ్ కానిస్టేబుల్ (Head Constable) రాసిన లేఖ(Letter) లిక్క‌ర్ కేసుపై ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. డీజీపీ(DGP)కి రాసిన లేఖలో హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి (Madan Reddy) సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, చిత్రహింసలకు గురిచేశార‌ని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకుడు (YSRCP Leader) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి లిక్కర్ కేసుతో సంబంధం ఉందని, రూ.200-250 కోట్లు రవాణా చేశానని తప్పుడు వాగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు బలవంతం చేశారని మదన్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు లేఖ‌లో పేర్కొన్నారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది, వైసీపీ ఈ ఘటనను “రెడ్‌ బుక్‌ రాజ్యాంగం” (“Red Book Constitution”)గా విమర్శిస్తూ, త‌ప్పుడు వాంగ్మూలం ఇవ్వాల‌ని అధికారులు ప్రొత్స‌హించిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించింది.

మదన్ రెడ్డి తన లేఖలో, సిట్ విచారణ సమయంలో తనపై శారీరక హింస చేశారని వివరించారు. “తల, ముఖం, వీపు భాగంలో పిడిగుద్దులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని బలవంతం చేశారు. గిరి(Giri) అనే వ్యక్తిని కొట్టి ఒప్పించారని తెలిసి, నేను యూనిఫాంలో విచారణకు హాజరయ్యాను. అయినా, మరుసటి రోజు యూనిఫాం తీసేసి రావాల‌ని సూచించారు” అని ఆయన తెలిపారు. సిట్ అధికారుల దాడి కారణంగా తాను 6 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందానని, ఇకపై ఒంటరిగా విచారణకు హాజరు కాలేనని, ఉద్యోగం కోల్పోయినా ప‌ర్వాలేదని మదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు సిట్ విచారణ పద్ధతులపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతున్నాయి.

మదన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర 10 సంవత్సరాల పాటు గన్‌మ్యాన్‌ (Gunman)గా పనిచేశారు. “చెవిరెడ్డి కుటుంబం లిక్కర్ కారణంగా ఇద్దరిని కోల్పోయింది. అందుకే ఆయన ఓట్ల కోసం కూడా మద్యం పంచరని చెప్పేవారు. అలాంటి వ్యక్తి రూ.200-250 కోట్లు రవాణా చేశారని ఎలా చెప్పమంటారు?” అని ఆయన లేఖలో కానిస్టేబుల్‌ ప్రశ్నించారు. సిట్ అధికారులు తనను “ఉద్యోగం పీకి, జైల్లో పెడతామని” హెచ్చరించారని, తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనందుకు దాడి చేశారని ఆయన ఆరోపించారు.

ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ లీగల్ సెల్ (YSRCP Legal Cell) అధ్యక్షుడు మనోహర్ రెడ్డి (Manohar Reddy) స్పందించారు. “రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమ‌లుకు కానిస్టేబుల్ మ‌ద‌న్‌రెడ్డికి ఎదురైన వేధింపులు, దాడి నిద‌ర్శ‌నం”గా అభివర్ణించారు. చెవిరెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు సిట్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ లేఖతో లిక్కర్ కేసు విచారణలో సిట్ పాత్రపై తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ, సిట్ అధికారుల చిత్రహింసలపై కోర్టులో పోరాడతామని ప్రకటించింది. “మదన్ రెడ్డిపై జరిగిన దాడి, తప్పుడు వాంగ్మూలం కోసం ఒత్తిడి రాజకీయ కుట్రలో భాగమని, ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం” అని మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది. సిట్ విచారణలో నిష్పక్షపాతం, నాణ్యత లేకపోవడం వల్ల ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు ఏ విధంగా సాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment