కొమ్మినేనికి బెయిల్‌.. ‘సుప్రీం’ తీర్పుపై వైఎస్ జ‌గ‌న్ రియాక్ష‌న్‌

కొమ్మినేనికి బెయిల్‌.. 'సుప్రీం' తీర్పుపై వైఎస్ జ‌గ‌న్ రియాక్ష‌న్‌

సీనియర్ జర్నలిస్టు (Senior Journalist) కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineini Srinivasarao)కు బెయిల్ (Bail) మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) వైఎస్ జ‌గ‌న్‌ (YS Jagan) స్వాగతించారు. ఈ తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu)కి చెంపపెట్టుగా ఉందని, నిరంకుశ పాలనకు గట్టి హెచ్చరికగా నిలిచిందని ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ట్వీట్ చేశారు.

నిరంకుశంగా, అప్రజాస్వామికంగా (Undemocratically), అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పిందన్నారు. చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలు, అమరావతి నిర్మాణంలో (Amaravati Construction) వేల కోట్ల అవినీతి (Corruption) ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కృత్రిమ వివాదాన్ని సృష్టించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన ఎల్లో మీడియా గ్యాంగ్‌ (Yellow Media Gang)తో కలిసి కొమ్మినేనిపై తప్పుడు ఆరోపణలు చేసి, విషప్రచారం చేయించారని జగన్ విమర్శించారు. మహిళల నిరసనల పేరుతో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి రౌడీయిజానికి పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. ఈ చర్యలు మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు.

ఒక విశ్లేషకుడి వ్యాఖ్యలకు యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి సంబంధం లేదని, అయినప్పటికీ ఆయనను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేయడం చంద్రబాబు కుట్రలో భాగమని జగన్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఈ కుట్రను బట్టబయలు చేసిందని ఆయన అన్నారు.

ఈ అరెస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో అక్రమ అరెస్టులు, అప్రజాస్వామిక చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు, వక్రీకరణలతో పాలన సాగిస్తున్నారని, అయితే ఇవి శాశ్వతంగా నిలబడవని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు అరాచక పాలనకు గట్టి దెబ్బ తగిలించిందని, ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా ఒక ముందడుగని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని, వచ్చే రోజుల్లో చంద్రబాబు చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment