వైసీపీ సీనియర్ నేత (YSRCP Senior Leader), మాజీ మహిళా మంత్రి (Former Woman Minister) జాతీయ హక్కుల సంఘాలను (National Rights Commissions) ఆశ్రయించడం సంచలనంగా మారింది. మీడియా ఛానల్ ముసుగులో తనపై, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రతిపక్ష మహిళా నేతలు, వైసీపీ అధ్యక్షుడు (YSRCP President) వైఎస్ జగన్ (Y.S. Jagan)పై తప్పుడు ప్రచారానికి (False Campaign) తెగబడుతున్నారని, సోషల్ మీడియా హ్యాండిల్స్ (Social Media Handles) ద్వారా అసభ్యకర దూషణలు చేయిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC), జాతీయ మహిళా కమిషన్ (NCW)కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులో ఏబీఎన్ న్యూస్ ఛానల్ (ABN News Channel), సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అత్యంత దారుణంగా జరుగుతున్న వ్యక్తిగత దాడులను, అవమానకరమైన వ్యాఖ్యలను ప్రస్తావించినట్లుగా తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ (Andhra Jyothi Channel) ద్వారా వైసీపీ నాయకులపై (YSRCP Leaders) నిరంతరంగా అసత్య, అవమానకరమైన కథనాలు ప్రసారం చేయడం ద్వారా వారి వ్యక్తిగత, రాజకీయ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలలో కొన్ని హ్యాండిల్స్ ద్వారా తనపై, వైఎస్ జగన్ కుటుంబ సభ్యులైన వైఎస్ విజయమ్మ (YS Vijayamma), వైఎస్ షర్మిల (YS Sharmila), మాజీ మంత్రి రోజా (Roja)పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.
“ఈ దాడులు కేవలం రాజకీయ విమర్శలు కాకుండా, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని, మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి” అని రజిని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ చర్యలు మానవ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్హెచ్ఆర్సీ, ఎన్సీడబ్ల్యూ కమిషన్లను కోరారు. వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియా ట్రోలింగ్స్పై జాతీయ స్థాయికి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. ఎన్హెచ్ఆర్సీ, ఎన్సీడబ్ల్యూ ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.