ఉమ్మడి అనంతపురం (Anantapuram) జిల్లాలో మైనర్ బాలిక (Minor Girl)ను బ్లాక్మెయిల్ (Blackmail) చేస్తూ ఆరు నెలల పాటు 14 మంది యువకులు (Youth) సామూహిక అత్యచారానికి పాల్పడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అదే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థి (Intermediate Student) తన్మయి (Tanmayi) హత్య కేసు (Murder Case) రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (Law And Order) అమలుపై ప్రశ్నలు లేవనెత్తింది. అనంతపురంలో జరిగిన ఈ రెండు దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉండవల్లి (Undavalli) సీఎం క్యాంప్ కార్యాలయంలో (CM Camp Office) ఈ దారుణ ఘటనలపై సమీక్ష నిర్వహించారు. డీజీపీ(DGP) హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta)తో పాటు ఉన్నతాధికారులు సీఎంకు దర్యాప్తు వివరాలను తెలిపారు.
తన్మయి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురైన ఘటన, ఏడుగురాళ్ళపల్లి (Edgurallapalli)లో బాలికపై కొందరు చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడిన దారుణాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, నిందితులకు వెంటనే కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఈ కేసుల్లో విచారణను త్వరగా పూర్తి చేసి, ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, ట్రయల్స్ వేగంగా ముగిసేలా చూడాలని అధికారులకు సూచించారు. క్షణికావేశంలో, గంజాయి మత్తులో లేదా వ్యవస్థీకృతంగా ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే సందేశం ఇవ్వాలని సీఎం అన్నారు. ఈ సమీక్షలో చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రలడ్డా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా, ఆదివారం రాత్రి సీఎం నివాసానికి సమీపంలో 5 నెలల గర్భిణీగా ఉన్న మహిళా కానిస్టేబుల్పై మందుబాబులు దాడి చేసిన విషయం తెలిసిందే. విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటున్న సమయంలో తప్పతాగిన వ్యక్తులు కానిస్టేబుల్ దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.