కవితకు తెలంగాణ పౌరుషం లేదు.. – బీజేపీ ఎమ్మెల్యే కీల‌క వ్యాఖ్య‌లు

కవితకు తెలంగాణ పౌరుషం లేదు.. - బీజేపీ ఎమ్మెల్యే కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy) వ్యాఖ్య‌లు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికాలో (America) ఉద్యోగం (Job) చేసిన కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) తెలంగాణ పౌరుషం (Telangana Courage) లేదని ఆరోపించారు. కవిత మాట్లాడేముందు తన స్థాయిని పరిశీలించాలని సూచించారు. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) రక్తం ఇటలీకి (Italy) చెందినదైతే, మోదీది (Modi’s) హిందూ రక్తమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటలీ గాంధీ స్థాయి పడిపోయిందని విమర్శిస్తూ, “ఇది పాత భారత్ కాదు, కొత్త భారత్. ఇప్పుడు అమెరికా చెప్తే వినే రోజులు పోయాయి” అన్నారు. రాహుల్ గాంధీ టీషర్ట్లు వేసుకునే నటన మానుకుని తెలివిగా మాట్లాడాలంటూ చురకలు వేయించారు.

బీఆర్‌ఎస్ ధర్నా చౌక్‌లను ఎత్తేసిందని, కల్వకుంట్ల కుటుంబానికి అక్కడ నిలబడి మాట్లాడే అర్హత లేదన్నారు. కాళేశ్వరానికి ‘అన్నీ తానే’ అన్న అపర బ్రహ్మా కేసీఆర్(KCR), ఆ నిర్మాణాన్ని ఎలా చేశారు అనే విషయం తన కూతురు కవిత అడగాలన్నారాయన. “కేసీఆర్ ఏ కాలేజ్‌లో చదివారు? ఎక్కడ సివిల్ ఇంజినీరింగ్ చేశారు? ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు?” అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ బీజేపీ ఈడీ (ED) ఒక్కదాన్నే చూపించిందని, కానీ చూడాల్సిన డీల్స్ ఇంకా చాలా ఉన్నాయన్నారు.

ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు..
తన విమర్శల ధాటిని కొనసాగిస్తూ, తెలంగాణలో అధికార గణం అందాల భామల చుట్టూ తిరుగుతోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి. రైతులు పండించిన పంటలు పూర్తిగా కొనుగోలు కాలేదని, రైతులు తమ సమస్యలు చెప్పేందుకు బీజేపీ భరోసా సభలకు క్యూ కడుతున్నారని తెలిపారు. రాష్ట్ర పరిపాలనను గాలికొదిలి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 18 నెలల్లో 45 సార్లు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. భరోసా కార్యక్రమంలో ఉద్యోగాల క్యాలెండర్‌పై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వర్షాకాలం రాకముందే రావలసిన రైతు బంధు రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. “మీ రాజకీయ కుమ్ములాటలు పక్కనపెట్టి రైతులకు తక్షణమే రైతు బంధును విడుదల చేయాలి” అంటూ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment