“ఆ కన్నీళ్లను నేను మాత్రమే చూశా” – అనుష్క శ‌ర్మ ఎమోష‌న‌ల్‌

“ఆ కన్నీళ్లను నేను మాత్రమే చూశా” - అనుష్క శ‌ర్మ ఎమోష‌న‌ల్‌

టీమిండియా ర‌న్ మెషీన్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టు క్రికెట్‌ (Cricket) కు గుడ్‌బై (Goodbye) చెబుతూ క్రికెట్ అభిమానుల‌ను షాక్‌కు గురిచేశారు. కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఈ వార్త‌ను ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య, నటి అనుష్క శర్మ (Anushka Sharma) ఒక ఎమోషనల్ (Emotional) మెసేజ్ పోస్ట్ (Post) చేశారు. “అందరూ నీ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడతారు. కానీ, మీకు ఎవరికీ తెలియ‌ని కన్నీళ్లు, ఈ ఫార్మాట్‌పై చూపిన అంతులేని ప్రేమ నాకెప్పటికీ గుర్తుంటుంది” అని అనుష్క భావోద్వేగంతో పేర్కొన్నారు.

ఆమె పోస్ట్‌లో, కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో రాణించ‌డానికి చేసిన కృషిని అనుష్క‌శ‌ర్మ ప్రత్యేకంగా వివరించారు. “వైట్ బాల్ క్రికెట్ నుంచి మీరు రిటైర్ అవుతారని ఊహించా. మీరు అద్భుతమైన వీడ్కోలును పొందారు” అని ఆమె తెలిపింది. కోహ్లి టెస్ట్ కెరీర్ ముగిసిన సందర్భంగా, అభిమానులు, క్రికెట్ ప్రముఖులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అనుష్క పోస్ట్ మరోసారి ఈ స్టార్ జోడీకి ఉన్న బంధాన్ని చూపించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment