Operation Sindoor : 80 మందికిపైగా టెర్రరిస్టులు హ‌తం

Operation Sindoor : ఆపరేషన్ సింధూర్‌లో 80 టెర్రరిస్టులు హ‌తం

క‌శ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టుల‌పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జ‌రిపిన కాల్పుల‌కు భార‌త్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindhur) పేరుత మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి పాకిస్తాన్ (Pakistan), పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపుదాడులు చేసింది. ఇండియ‌న్ ఆర్మీ దాడిలో 80-90 మందికిపైగా టెర్రరిస్టులు (Terrorists) మరణించారని భద్రతా దళాలు (Security Forces) తెలిపాయి. ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్‌బుల్ ముజాహీద్దీదీన్‌లతో సంబంధం ఉన్న తొమ్మిది ఉగ్ర‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భార‌త ద‌ళాలు దాడి మెరుపుదాడి చేసింది.

భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే..

ఆప‌రేష‌న్ సింధూర్‌లో భాగంగా పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌, పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భార‌త సైన్యం ధ్వంసం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీట‌ర్ల‌ లోపు ఉన్న స్థావరాలను భార‌త్‌ టార్గెట్‌ చేసి దాడి చేసింది.

  • అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం
  • మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌
  • సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌
  • పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్‌ లష్కరే క్యాంప్‌
  • జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌
  • రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌
  • రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌
  • సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.
  • అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హెచ్‌ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్

Join WhatsApp

Join Now

Leave a Comment