ఆరేళ్ల లోపు పిల్లల కోసం ఆధార్ స్పెషల్ డ్రైవ్

ఆరేళ్ల లోపు పిల్లల కోసం ఆధార్ స్పెషల్ డ్రైవ్

ఆరేళ్ల‌లోపు (Under Six Years) చిన్నారుల (Children) త‌ల్లిదండ్రుల‌కు (Parents) ఏపీ (Andhra Pradesh) అధికారులు శుభ‌వార్త చెప్పారు. చిన్నారుల కోసం ఆధార్ నమోదు కార్యక్రమాన్ని (Aadhaar Enrollment Program) ప్రత్యేక శిబిరాల రూపంలో నిర్వహించనున్నట్లు వెల్ల‌డించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, అలాగే 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో (Village and Ward Secretariats ) ఈ శిబిరాలు జరుగుతాయి.

తల్లిదండ్రులు తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate) (బర్త్ సర్టిఫికెట్)తో కలిసి సమీప సచివాలయానికి వెళ్లి ఆధార్ నమోదు చేయించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే జనన ధ్రువీకరణ పొందిన సుమారు 1.07 లక్షల మంది పిల్లలు ఆధార్ కోసం మిగిలి ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇంతకుముందే ఆధార్ తీసుకున్న పిల్లల వివరాలను సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు. అధికారుల ప్ర‌క‌ట‌న ఆరేళ్ల‌లోపు చిన్నారుల త‌ల్లిదండ్రుల‌కు ఊర‌ట‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment