జీవీఎంసీ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు

జీవీఎంసీ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు

విశాఖపట్నం జీవీఎంసీ (GVMC) మేయర్ (Mayor) పదవికి పీలా శ్రీనివాసరావు (Peela Srinivasa Rao) ఏకగ్రీవంగా (Unanimously) ఎన్నికయ్యారు. జనసేన (Jana Sena) పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamsikrishna Srinivas) పీలా శ్రీ‌నివాసరావు పేరును ప్రతిపాదించగా, బీజేపీ (BJP) ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) మద్దతు తెలిపారు. అనంతరం మిగిలిన సభ్యులంతా సమ్మతం తెలపడంతో శ్రీనివాసరావు మేయ‌ర్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

2024 ఎన్నిక‌ల త‌రువాత అధికార మార్పుతో రాష్ట్రంలోని ప‌లు ముఖ్య‌మైన ప్రాంతాల్లోని స్థానిక సంస్థ‌ల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్, జీవీఎంసీ మేయ‌ర్ స్థానాల‌ను అధికార పార్టీలు త‌మ ఖాతాలో వేసుకున్నాయి. అదే విధంగా గుంటూరు మేయర్, పాలకొండ, తుని, కుప్పం మున్సిపాలిటీల చైర్మ‌న్ స్థానాల‌ను కూడా కూట‌మి ద‌క్కించుకుంది. బ‌లం లేక‌పోయినా అధికారం అండ‌తో ప్ర‌తిప‌క్ష కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌ను బెదిరించి, భ‌య‌పెట్టి కూట‌మి ప్ర‌భుత్వం అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వైసీపీ మండిప‌డుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment