గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Visakhapatnam Municipal Corporation – GVMC)ను తమవంశం చేసుకోవాలని అధికార కూటమి పార్టీల వారి వ్యూహాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. బలం లేకపోయినా, ఎలాగైనా మేయర్ స్థానం కూటమిదే అయ్యుండాలనే ఆకాంక్షతో అనేక ఎత్తుగడలు వేస్తోంది. మేయర్ (Mayor) స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ (YSRCP) కూడా అంతే ప్రయత్నిస్తోంది.
తాజాగా టీడీపీ (TDP) నేతల వైఖరి వివాదాస్పదంగా మారింది. కేరళ (Kerala) లో మున్నార్ (Munnar) లోని ఓ హోటల్లో బస చేస్తున్న వైసీపీ కార్పొరేటర్ల (YSRCP Corporators)ను తమవైపు లాక్కునేందుకు టీడీపీ నేతలు ఆ హోటల్కు వెళ్లారు. ఏకంగా పోలీసులను వెంట పెట్టుకొని మున్నార్లోని వైసీపీ కార్పొరేటర్లు బస చేస్తున్న హోటల్లోని రిజిస్టర్ (Register) ను టీడీపీ నేతలు తనిఖీ చేస్తున్న వీడియో (Video) బయటపడి వైరల్గా మారింది. వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు పోలీసులను వెంట తీసుకువెళ్లడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు కొచ్చి ఎయిర్పోర్ట్లో ఏకంగా చార్టర్ ఫ్లైట్ను టీడీపీ సిద్ధం చేసినట్లుగా సమాచారం. వైసీపీ వారు టీడీపీ ఆఫర్ను నిరాకరించడంతో టీడీపీ నేతలు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
కార్పొరేటర్లను తమవైపునకు లాగేసుకునేందుకు టీడీపీ నేతలు ఏకంగా పోలీసుల (Police) సహాయ, సహకారాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బలం లేకపోయినా తెలుగుదేశం పార్టీ అరాచకంగా ప్రవర్తిస్తోందని వైసీపీ మండిపడుతోంది. వైసీపీ క్యాంపునకు టీడీపీ నేతలతో పోలీసులు రావడం ఏంటని ప్రశ్నిస్తోంది. మరి దీనిపై అధికార పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.