తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ (Ganta Srinivasa Rao) తాజాగా చేసిన ట్వీట్ (Tweet) సంచలనం రేపింది. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి విజయవాడ (Vijayawada) కు విమానం (Flight) లో ప్రయాణం చేసే సమయంలో సదుపాయాల లేమి కారణంగా ఎదురైన కష్టాలను గంటా శ్రీనివాస్ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి (Amaravati) చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అంటూ ఓ ట్వీట్ పెట్టారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు (Hyderabad Airport) వచ్చిన తాను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం(Vijayawada Flight) క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టు (Gannavaram Airport) కు చేరేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందన్నారు. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖ నుంచి విజయవాడకు చేరేందుకు హైదరాబాద్కు వెళ్లి రావాల్సి వచ్చిందని, ఇదీ విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి అని ట్వీట్లో పేర్కొన్నారు.
టీడీపీ(TDP) ఎమ్మెల్యే గంటా ట్వీట్ (Ganta Tweet) చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు (Netizens) సెటైరికల్ కామెంట్స్ (Satirical Comments) చేస్తున్నారు. ఎమ్మెల్యే అయిన మీరు సీఎం (CM) కు డైరెక్ట్గా చెప్పొచ్చుగా, ట్వీట్ పెట్టడం ఎందుకు..? అని సుఖవంతమైన ప్రయాణంలోనూ కష్టాలు వెతుక్కుంటున్నారా..? అని మరి కొందరు. ఈ విషయాన్ని విమానయాన శాఖ మంత్రికి చెప్పండి సారూ అని ఇంకొందరూ సెటైరికల్ కామెంట్స్ చేస్తూ సలహాలు ఇస్తున్నారు.
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 15, 2025
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి… pic.twitter.com/kDMWFyjs9I