ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్: శ్రేయస్, జార్జియా వాల్‌

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్: శ్రేయస్, జార్జియా వాల్‌

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Player of the Month) (మార్చి) అవార్డు పురుషుల విభాగంలో భారత (India) బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer) ను వరించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయన చూపిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఈ గౌరవాన్ని పొందారు. ఈ అవార్డుకు న్యూజిలాండ్‌కి చెందిన రచిన్ రవీంద్ర, జాకోబ్ డఫీ కూడా పోటీ పడినా, శ్రేయస్ గెలిచి మరీ నిలిచారు. అదే విధంగా మహిళల విభాగంలో ఆస్ట్రేలియా (Australia) యువ క్రికెటర్ జార్జియా వాల్ (Georgia Voll) అవార్డును దక్కించుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment