‘నితీష్‌ను ఉప ప్రధాని చేయాలి’.. బీజేపీ నేత సంచలన డిమాండ్‌

'నితీష్‌ను ఉప ప్రధాని చేయాలి'.. బీజేపీ నేత సంచలన డిమాండ్‌

బీహార్ (Bihar) రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ (BJP) నేత అశ్విని కుమార్ చౌబే (Ashwini Kumar Choubey) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన జేడీయూ (JDU) అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ (Nitish Kumar)కి ‘‘ఉప ప్రధానమంత్రి (Deputy Prime Minister) హోదా (Post) ఇవ్వాలి’’ అంటూ సంచలన ప్రకటన (Sensational Statement) చేశారు.

ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని స్పష్టం చేసినా, ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు తెర‌పైకి వచ్చాయ‌ని, వీటి వెనుక రాజకీయ వ్యూహాలున్నాయన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. ‘‘నితీష్ కుమార్ ఎన్డీఏ (NDA) కోసం చేసిన సేవలు విశేషమైనవే. ఆయన ప్రధాని మోడీ (Prime Minister Modi) కి బలంగా నిలుస్తున్నారు. ఉపప్రధాని పదవి ఆయన్ని గౌరవించడమే కాక, బీహార్‌ గర్వించదగిన ఘనత కూడా అవుతుంది. బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) తర్వాత నితీష్ కుమారే బీహార్ నుంచి అటువంటి ఉన్నత స్థానాన్ని అలంకరించగలరు’’ అని చౌబే వ్యాఖ్యానించారు.

ఇదంతా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ శక్తుల సమీకరణ మారుతోందన్న సంకేతంగా పరిగణించవచ్చు. నవంబర్ 2025లో జరగబోయే బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ–జేడీయూ (BJP–JDU) పొత్తు మరోసారి పరీక్షకు ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో నితీష్‌కు గౌరవప్రదమైన నిష్క్రమణ కల్పించాలన్న ఆలోచనలో భాగంగా ‘ఉప ప్రధాని’ వ్యాఖ్యలు వచ్చాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment