రోడ్డు ప్ర‌మాదంలో డిప్యూటీ కలెక్టర్ దుర్మ‌ర‌ణం

రోడ్డు ప్ర‌మాదంలో డిప్యూటీ కలెక్టర్ దుర్మ‌ర‌ణం

అన్నమయ్య జిల్లా (Annamayya district) సంబేపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై జ‌రిగిన ఈ రోడ్డు ప్ర‌మాదంలో హంద్రీనీవా స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ తీవ్ర గాయాల‌పాలై ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం పీలేరు-రాయచోటి (Pileru-Rayachoti) రహదారిలో రెండు కార్లు వేగంగా ప్ర‌యాణిస్తూ ఒక‌దానికొక‌టి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో ఒక కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జ‌రిగిన వెంట‌నే స్థానికులు స్పందించిన చికిత్స నిమిత్తం క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల‌తో అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మంగా ఉన్న స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ (Special Deputy Collector) ర‌మాదేవి (Rama Devi) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు (Passed Away) వైద్యులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment