క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) – 2025 సాయంత్రం 6 గంటలకు IPL 2025 ఓపెనింగ్ వేడుకలు గ్రాండ్గా ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది ఐపీఎల్ ఓపెనింగ్లో బాలీవుడ్ తారల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి కూడా అద్భుతమైన డాన్స్, మ్యూజిక్ షోతో క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు టాప్ సెలెబ్రిటీలు సిద్ధమయ్యారు.
ఈ వేడుకలో బాలీవుడ్ నటీనటులు దిశా పటానీ, శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ తళుక్కున మెరవనున్నారు. వీరి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. మ్యూజిక్ పరంగా శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్ సాంగ్స్తో అలరించనున్నారు. పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లా తన ఎనర్జిటిక్ ర్యాప్తో స్టేజ్పై దుమ్ము రేపనున్నారు.
ఓపెనింగ్ వేడుక అనంతరం రాత్రి 7:30 గంటలకు KKR vs RCB మధ్య ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.