నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి (55)ని గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా హత్య చేశారు. సుధాకర్ రెడ్డి తన పొలానికి వెళ్లి వస్తుండగా దుండగులు అతడిపై వేట కొడవళ్లతో దాడి చేసి అక్కడికక్కడే చంపేశారు. ఈ ఘటన గ్రామాన్ని షాక్‌కు గురిచేసింది.

ఈ హత్యకు ఆధిప‌త్య‌పోరే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘోర సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. గ‌త 10 నెల‌లుగా వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు, కేసులు, హ‌త్య‌లు, అరాచ‌కాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment