నేటి నుంచి IPL-2025 మ‌హా సంగ్రామం

నేటి నుంచి IPL-2025 మ‌హా సంగ్రామం

క్రికెట్ ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ నేడు ఘ‌నంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ సీజన్ 18 ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తలపడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌(Eden Gardens)లో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. గత సీజన్ విజేతగా కేకేఆర్ జట్టు నిలిచింది. ఆర్‌సీబీ జట్టు కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నేతృత్వంలో ఈ సీజ‌న్‌లో అయినా త‌మ డ్రీమ్ నెర‌వేర్చుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

మొత్తం 10 జట్లు..
కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్.

ప్రతి జట్టు తమ ప్రత్యేక బలాలతో సీజన్‌లో పోటీపడుతుంది. కేకేఆర్, ముంబై ఇండియన్స్, చెన్నై వంటి బ‌ల‌మైన టీమ్స్ గతంలో అనేక సార్లు క‌ప్‌ను త‌మ సొంతం చేసుకున్నాయి. ఈ సీజన్‌లో కూడా బలంగా నిలుస్తారని అంచనా ఉంది. అలాగే, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ తొలి టైటిల్‌ను గెలుచుకోవడానికి కృషి చేస్తున్నాయి. ఐపీఎల్ అనేది ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ సాగే మ్యాచ్ కావ‌డంతో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో ముందస్తుగా ప్రిడిక్ట్ చేయ‌డం కూడా క‌ష్ట‌మే.

ఐండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్ 18 మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించ‌వ‌చ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment