ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) లను తీవ్రంగా విమర్శిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పీ4-జీరో పావర్టీ’ కార్యక్రమం చంద్రబాబు (Chandrababu) లేటెస్ట్ పబ్లిసిటీ స్టంట్ ఆరోపించిన అంబటి.. రాష్ట్రంలో బంగారు కుటుంబాలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కుటుంబాలే జ్ఞాపకం వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు చంద్రబాబు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. తొమ్మిది నెలల్లో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ (YS Jagan) సృష్టించిన సంపద మెడికల్ కాలేజీలు (Medical Colleges), పోర్టు (Ports)లను ప్రైవేట్పరం చేస్తూ చంద్రబాబు సొంత సంపద సృష్టించుకుంటున్నారన్నారు. ఉమ్మడి ఏపీలో 58 ప్రభుత్వరంగ కార్పోరేషన్లను ప్రైవేటీకరించిన ఘనత చంద్రబాబుదేనని గుర్తుచేశారు.
లోకేష్ను సీఎం చేయాలని..
నీతి, నిజాయితీలతో తాను ఎన్టీ రామారావు (NTR) వద్ద క్రమశిక్షణతో పనిచేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని, ఇందిరాగాంధీ (Indira Gandhi) వద్ద ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దక్కించుకున్నాడే తప్ప ఆయన ఎన్టీఆర్ వద్ద ఎప్పుడు పనిచేశాడు? అని అంబటి ప్రశ్నించారు. క్రమశిక్షణ ఎక్కడ నేర్చుకున్నాడని నిలదీశారు. తన కుమారుడిని రాజకీయాల్లో ల్యాండ్ చేసి, సీఎంను చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అసమర్థుడు, అజ్ఞాని అయిన లోకేశ్ను ఆంధ్రరాష్ట్రంపై ఎలా రూద్దాలనేదే ఆలోచనలో చంద్రబాబు మునిగిపోయారన్నారు.
ప్యాకేజీ రాజా పవన్ కళ్యాణ్
తన దగ్గర సత్తా (Capability) లేదని తనకు తానే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడని, చంద్రబాబుకు మాత్రమే సత్తా, పాలనా సామర్థ్యం ఉందని, ఆయన కిందే సేవ చేస్తానని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారని అంబటి చెప్పారు. తమ నాయకుడు సీఎం కావాలన్న అభిమానుల అరుపులు వింటే పవన్ వారిని సస్పెండ్ చేస్తాడేమో అని చురకలు అంటించారు. ఈ సందర్బంగా సీ.నారాయణరెడ్డి (C. Narayana Reddy) రాసిన ఒక గేయాన్ని అంబటి రాంబాబు వినిపించారు. ‘కరగనిదే కొవ్వోత్తి కాంతిని ఎలా ఇస్తుంది.. మరగనిదే నీరు ఎలా మబ్బురూపు దాలుస్తుంది.. నలగనిదే అడుగులు ఎలా నర్తించబడతాయి.. మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది..?’ అని వివరించారు. సామర్థ్యం పెంచుకునే ప్రయత్నం చేసే ఆలోచనే పవన్ కళ్యాణ్కు లేదని జనసేన సైనికులు (Janasena Cadres), కాపు సోదరులు (Kapu Brothers) అర్ధం చేసుకోవాలన్నారు.
పప్పురాజా.. చిట్టి రాజా.. ప్యాకేజీ రాజా..
ప్రభుత్వంలో వసూళ్లు, బదిలీలు, కమీషన్లు అన్నీ పప్పురాజా నారా లోకేష్ చేస్తున్నారని, దీనిలోంచి ప్యాకేజీ రాజా (Package Raja) పవన్ కళ్యాణ్కు వాటా పంపుతున్నారని అంబటి రాంబాబు సంచలన ఆరోపణ చేశారు. ప్రతినెలా పవన్కు ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతోందని, అందువల్లే చంద్రబాబుకు సేవచేసుకుంటూ ఉంటే చాలు అని ఆయన భావించి ఉంటారన్నారు. పీ4 కార్యక్రమం జరుగుతుంటే పప్పురాజా నారా లోకేష్ ఎక్కడా..? చిట్టిరాజా (Chitti Raja) క్రికెట్ మ్యాచ్ చూయడానికి వెళ్లాడని సెటైర్లు వేశారు. ప్రతి వారంలో రెండు రోజులు శని, ఆదివారాలు చిట్టిరాజాకు విరామం. రెండు వారాలకు ఒక సారి చంద్రబాబుకు విరామం. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు పనిలో ఉంటారో, ఎప్పుడు విరామంలో ఉంటారో తెలియదని వైసీపీ నేత అంబటి సంచలన విమర్శలు చేశారు.