ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ, క్వాలిఫయర్-1కు ముందు గుజరాత్ టైటాన్స్(GT) ఆటగాళ్లు రిలాక్స్ మోడ్లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జట్టు స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్(Mohammed Siraj), ప్రసిద్ధ్ కృష్ణలు (Prasidh Krishna) హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల (Dharamshala) సమీపంలోని ఓ నదిలో స్నానం (River Bathing) చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కీలక మ్యాచ్ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈ ఇద్దరు బౌలర్లు ఇలా నేచర్ మధ్య చిల్(Chill) అవ్వడం అభిమానులను ఆకట్టుకుంది. చల్లని వాతావరణం, పచ్చని కొండలు, ప్రశాంతమైన నదీ తీరాలతో ప్రసిద్ధి చెందిన ధర్మశాలలో జీటీ ప్లేయర్లు సరదాగా గడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో గుజరాత్ టైటాన్స్ తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజేత నేరుగా ఫైనల్కు చేరుకోనున్నందున రెండు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు విరాట్ కోహ్లీ (Virat Kohli) సేన రెండో ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా అడుగులు వేస్తుండగా, మరోవైపు గుజరాత్ టైటాన్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల ఫామ్ జీటీకి కీలకంగా మారనుండగా, ఈ హై వోల్టేజ్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఆసక్తి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో హాట్ డిస్కషన్గా మారింది.









‘నీ కుటుంబంపై నిందలేస్తుంటే నువ్వెక్కడమ్మా షర్మిలమ్మా..?’