‘సాక్షి’పై దాడుల వెన‌క అస‌లు కార‌ణం ఇదే.. – రోజా కీల‌క వ్యాఖ్య‌లు

'సాక్షి'పై దాడుల‌కు అస‌లు కార‌ణం ఇదే.. - రోజా కీల‌క వ్యాఖ్య‌లు

ఒక మ‌హిళా హోంమంత్రి (Woman Home Minister) ఉన్న రాష్ట్రంలో ఆడ‌వారికి (Women) మాన‌ప్రాణాల‌కు ర‌క్ష‌ణ (Protection) లేక‌పోవ‌డం సిగ్గుచేటు అని వైసీపీ (YSRCP) సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) అన్నారు. అనంతపురం (Anantapur)లో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హ‌త్య‌, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం రామగిరిలో దళిత మైనర్ బాలిక (Dalit Minor Girl)పై ఆరు నెల‌లుగా 14 మంది టీడీపీ నేతలు (14 TDP Leaders) సామూహిక అత్యాచారం ఘ‌ట‌న‌లు ఇందుకు ఉదాహ‌ర‌ణ అని అన్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై (Alliance Government) ఆర్కే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగ‌ళ‌వారం ఆమె నగరి (Nagari)లో మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళల భద్రత లోపించిందని, శాంతిభద్రతలు క్షీణించాయని, గంజాయి (Ganja), మద్యం (Liquor) విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయని ఆరోపించారు. అలాగే, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivas Rao) అరెస్ట్‌ను (Arrest) ఖండిస్తూ, ఇది రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు.

సాక్షి మీడియా ఈ ఘటనలను బయటకు తీసుకురాకపోతే, ఈ అరాచకాలు బహిర్గతం కాకపోయేవి అని రోజా అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అరాచ‌కాల‌ను సాక్షి బ‌య‌ట‌పెడుతుంద‌నే ఆ మీడియా ఛాన‌ల్‌పై ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా దాడులు చేయిస్తోంద‌ని ఆర్కే రోజా సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హోం మంత్రి అనిత (Anitha)లు మహిళల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. మ‌హిళా ర‌క్ష‌ణ గురించి ప్ర‌శ్నిస్తే.. హోం మంత్రి అనిత ‘నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా’ అంటూ చేతకాని మాటలు మాట్లాడుతున్నార‌ని, అనిత‌ వెంటనే రాజీనామా (Resignation) చేయాలి అని రోజా డిమాండ్ చేశారు.

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌పై విమర్శలు
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను రోజా తీవ్రంగా ఖండించారు. “కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దారుణం. జూన్ 6న జరిగిన ఒక టీవీ చర్చలో ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, చంద్రబాబు, నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేసి, ఒక పథకం ప్రకారం ఆయన్ను అరెస్ట్ చేయించారు” అని ఆమె ఆరోపించారు. “ఆడబిడ్డ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు, ‘ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలా, కడుపున చేయాలా’ అని మాట్లాడిన బాలకృష్ణ, జగన్ లండన్ వెళ్లినప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేసిన లోకేష్‌లపై ముందు కేసులు పెట్టాలి” అని రోజా డిమాండ్ చేశారు. ఏబీఎన్ వంటి ఛానెళ్లు వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోకుండా, కొమ్మినేని వంటి జర్నలిస్టులపై మాత్రం కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.

డైవర్షన్ పాలిటిక్స్‌పై విమర్శలు
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని రోజా ఆరోపించారు. “ఎల్లో మీడియా ద్వారా విషప్రచారం చేస్తూ, వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆమె అన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి మహిళకు గౌరవం, సంక్షేమం అందించే పాలన జరిగిందని, దిశా యాప్ వంటి చర్యల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించామని రోజా గుర్తుచేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment