హైకోర్టులో పేర్ని నానికి ఊర‌ట‌..

హైకోర్టులో పేర్ని నానికి ఊర‌ట‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత్యున్న‌త ధ‌ర్మాస‌నంతో వైసీపీ నేత పేర్ని నానికి ఊరట ల‌భించింది. రేష‌న్ బియ్యం కేసులో త‌న‌ను ఏ6గా చేర్చ‌డంతో ముంద‌స్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లు చేయ‌గా, ఆ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు సోమవారం వరకు పేర్నినానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏ క్ష‌ణ‌మైనా అరెస్టు చేస్తార‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ కోర్టు తీర్పుతో పేర్ని నానికి కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది.

రేష‌న్ బియ్యం కేసులో మచిలీప‌ట్నం పోలీసులు పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. ఈరోజు పేర్ని నానిని ఈకేసులో ఏ6గా చేర్చారు. ఇప్ప‌టికే ఈ కేసులో సివిల్‌ సప్లయ్‌స్‌ అసిస్టెంట్‌ మేనే­జర్‌ కోటిరెడ్డి, గోడౌన్‌ మేనేజర్‌ మా­నస తేజ, డ్రైవర్‌ మంగారావు, అత‌ని స్నేహితుడు ఆంజనేయులును అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం వీరు రిమాండ్‌లో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment