టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో విశ్వ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఫైనల్ మ్యాచ్లో సంజూ శాంసన్ 89 పరుగులతో అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయంపై పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు తనకే రావాల్సిందని, దాన్ని సంజూ శాంసన్కు ఇవ్వడం సరైంది కాదని ఫర్హాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అతడు అవసరమైతే ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తానని కూడా వ్యాఖ్యానించాడు. ఫర్హాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.








