పంజాబ్ నుంచి రాజ్యసభకు.. కేజ్రీవాల్ కొత్త ఎత్తుగడ?

పంజాబ్ నుంచి రాజ్యసభకు.. కేజ్రీవాల్ కొత్త ఎత్తుగడ?

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పంజాబ్ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొట్టినా, ఆ రాష్ట్ర ఆప్ లీడర్ల‌ అభ్యంత‌రం మేర‌కు ఆయన వెనుకడుగు వేశారని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా పంజాబ్ నుంచి కేజ్రీవాల్ పోటీ చేయనున్నారని పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ ఒత్తిళ్లు, అనుమానాస్పద ఆరోపణలు
పంజాబ్ నుంచి కేజ్రీవాల్ రాజ్యసభలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని ప్రతాప్ సింగ్ బజ్వా ఆరోపించారు. AAPకు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని బజ్వా సంచలన ఆరోపణలు చేశారు. కాగా, పంజాబ్‌లోని లూధియానా వెస్ట్ అసెంబ్లీ బైపోల్ ద్వారా కేజ్రీవాల్ పంజాబ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ప్రయత్నించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉపఎన్నికలో AAP రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా పోటీ చేయనున్నట్లు సమాచారం.

AAP మౌనం – కాంగ్రెస్ ఆరోపణలు..
పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు ఖాళీ అయితే, కేజ్రీవాల్ తన రాజకీయ భవిష్యత్తును రాజ్యసభ మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ ఆరోపణలపై ఇప్పటివరకు స్పందించలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో AAP భారీగా ఓటమిని చవిచూసింది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు, ఆప్ 22 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి కీలక నేతలు కూడా ఓటమిపాలవడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment