హైదరాబాద్ (Hyderabad)లోని నందినగర్ (Nandinagar) నివాసంలో బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao)తో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కీలక సమావేశం నిర్వహించారు. గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యమంత్రుల సమావేశం అజెండాలో చేర్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టును అజెండా నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉందని విమర్శలు గుప్పించింది. సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఈ అంశంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు పలు మార్లు ఆరోపణలు చేశారు.
బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








