చంద‌నోత్స‌వంలో అప‌శృతి.. విశాఖకు వైఎస్ జ‌గ‌న్‌

విశాఖకు వైఎస్ జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు సిద్ధమయ్యారు. సింహాచ‌లం శ్రీ వ‌రాహ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి చంద‌నోత్స‌వం (Chandanotsavam) లో విషాదం చోటుచేసుకుంది. ఆల‌యంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున గోడ‌కూలి ఎనిమిది మంది అమాయక భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. చంద‌నోత్స‌వం రోజున జ‌రిగిన ఈ విషాదక‌ర‌ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 20 రోజుల క్రితం నాసిర‌కంగా నిర్మించిన గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన భ‌క్తుల (Devotees) కుటుంబాలను (Families) వైఎస్ జ‌గ‌న్ పరామర్శించనున్నారు. అలాగే, విశాఖ ఆస్పత్రి (Visakha Hospital)లో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను కూడా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment