అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు – ‘కూట‌మి’పై జ‌గ‌న్ ఫైర్‌

అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు - కూట‌మిపై జ‌గ‌న్ ఫైర్‌

రాష్ట్రంలో ఏ ఒక్క పంట‌కు కనీస మద్దతు ధరలు (Minimum Support Prices – MSP) లభించక రైతులు (Farmers) రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నార‌ని వైసీపీ (YSRCP) అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశార‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి (Price Stabilization Fund) కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశామ‌ని, కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు (Tobacco) సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామ‌ని గుర్తు చేశారు. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రైతుల ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై వైఎస్ జ‌గ‌న్ ఎక్స్ ‘X’ వేదిక‌గా రియాక్ట్ అయ్యారు.

జ‌గ‌న్ ట్వీట్‌
`చంద్ర‌బాబు గారూ (Mr. Chandrababu)… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?

మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశ‌నగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?

చంద్రబాబు గారూ…, మిర్చి విషయంలోకూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?

ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని (Agriculture Sector) నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ (Markfed – Marketing Federation) ద్వారా కొనుగోలు చేయాలి` అని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment