అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ఎదుటే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికుల వివరాల ప్రకారం.. మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామానికి చెందిన రైతు అనిమిరెడ్డి రమణ తన ఆవేదనను చెప్పుకునేందుకు కలెక్టరేట్కు వచ్చారు. ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా మరణ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. తనకు న్యాయం చేయాలని, తన ఇల్లు మొత్తం కాలిపోయిందని రమణ అధికారులు చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోక పోవడంతో కలెక్టర్ ఎదుటనే ఆ రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అక్కడున్న సిబ్బంది రమణను ఆటోలో హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమణకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News Wire
-
01
జైల్లో రిమాండ్ ఖైదీ మృతి
నెల్లూరు సెంట్రల్ జైలు బ్యారక్లో కుప్పకూలిన ఖైదీ మౌలాలి (48). జీజీహెచ్కు తరలించగా అప్పటికే మరణించాడన్న వైద్యులు
-
02
విజయ డెయిరీ సంచలన నిర్ణయం
పాల సేకరణ ధరను లీటర్ కు రూ.3 పెంచిన విజయ డెయిరీ. వచ్చే నెల 1 నుంచి పాడి రైతులకు లీటర్ రూ.88 చెల్లింపు. ఎండీ ప్రకటన.
-
03
వర్షాలు కురవాలని తిరుమలలో యాగాలు
ఆగస్టు 30 నుంచి కారీరిష్టి యాగం. సెప్టెంబర్ 3 వరకు వరుణయాగం. సమృద్ధి వర్షాల కోసం పర్జన్యశాంతి హోమం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో యాగాలు
-
04
టీడీపీ కార్యాలయం ముట్టడి
కర్నూలు టీడీపీ ఆఫీసును ముట్టడించిన బుడజ జంగం నేతలు. బుడగ జంగాలకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్
-
05
ఏపీలో ఖరీదవుతున్న వైద్య విద్య
ఏపీలో వైద్య విద్య ఫీజులు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
-
06
అరకులో చంద్రబాబు సభ
అరకు లోయ నియోజకవర్గం గన్నెలిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-
07
700 దాటిన మృతుల సంఖ్య
నేపాల్ వరదల్లో 700 దాటిన మృతుల సంఖ్య, 5,851 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. 2,426 మంది గల్లంతు అయినట్టు వెల్లడి
-
08
ఆకాశమే హద్దుగా నిత్యావసరాలు
ఏపీలో సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసర ధరలు. భారీగా పెరిగిన బియ్యం ధరలపై ప్రజల ఆందోళన. శ్రద్ధ చూపని సర్కార్
-
09
రేవంత్కు రాఖీ కట్టిన కొండా సురేఖ
సీఎం రేవంత్ కోసం ప్రత్యేకంగా గోల్డ్ రాఖీ చేపించి కట్టిన మంత్రి సురేఖ. సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టిన కొండా సురేఖ
-
10
నేపాల్కు మరో జల ప్రళయం
రెండ్రోజుల క్రితం వచ్చిన వరదల కంటే 5 రెట్లు అధికంగా వచ్చే ప్రమాదం. పోలీసుల హెచ్చరికలతో నేపాల్ వాసుల పరుగులు








