ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కీలక మైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్తో విజయం సాధించిన టీమ్తోనే బరిలోకి దిగుతుంది. పాకిస్తాన్ మాత్రం ప్లేయింగ్ లెవన్లో ఒక ప్లేయర్ను మార్చింది. టాస్ ఓడిపోయినప్పటికీ మొదటి మ్యాచ్ ఎక్స్పీరియన్స్ తమకు ఉపయోగపడుతుందని, దుబాయ్ పిచ్లో బంగ్లాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఛేజింగ్కి విజయం సాధించామని రోహిత్ అభిప్రాయపడ్డారు. మరికొన్ని క్షణాల్లో లైవ్ యాక్షన్ స్టార్ట్ అవ్వబోతోంది. న్యూజిలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. టీమిండియా బంగ్లాదేశ్ను ఫస్ట్ మ్యాచ్ చిత్తుచేసి మంచి జోష్మీద ఉంది.
News Wire
-
01
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి. కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు. పాకాల మండలం తోటపల్లి వద్ద ప్రమాదం
-
02
బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి. మే 1 నుంచి జూలై 15 వరకు ప్రయోగత్మకంగా అమలు
-
03
జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి..
ఆపరేషన్ కగార్ అంశంపై జానారెడ్డితో చర్చిస్తున్న సీఎం రేవంత్. కేంద్రంతో చర్చలు జరిపే అంశాన్ని జానాకి అప్పగించే యోచన
-
04
నేడు మేయర్ ఎన్నిక
నేడు జీవీఎంసీ నూతన మేయర్ ఎన్నిక. కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన కూటమి. నేడు ఉదయం ప్రమాణస్వీకారం
-
05
నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.
వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో ఖాళీ అయిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 ఓట్లు.
-
06
తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
నేడు తుని మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక. టీడీపీకి 17, వైఎస్ఆర్ సీపీకి 11 మంది మద్దతు. ఎన్నికల్లో వైసీపీ పాల్గొనడంపై సందిగ్ధత.
-
07
పాకిస్తానీలకు ఏపీ డీజీపీ హెచ్చరిక
ఏపీలో ఉన్న పాకిస్తానీలు తక్షణమే దేశం విడిచి వెళ్లాలి. ఈనెల 27 తర్వాత ఏపీలో ఉంటే చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరిక
-
08
ఏపీలో నేడు, రేపు వర్షాలు
ఏపీలో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
-
09
ఏపీ లిక్కర్ కేసులో మరొకరు అరెస్ట్..
లిక్కర్ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు. సజ్జల శ్రీధర్రెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు.
-
10
నేడు శ్రీకాకుళంలో సీఎం పర్యటన
ఎచ్చర్లలో మత్స్యకార భృతి పంపిణీ చేయనున్న చంద్రబాబు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం.