భూమా విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓకు ఫిర్యాదు

ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్‌ విఖ్యాత్‌­ రెడ్డిపై ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) ఫిర్యాదు నమోదైంది.

మంత్రుల ఫిర్యాదు – విచారణ ప్రారంభం
నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారిక సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్థానంలో టీడీపీ నేత విఖ్యాత్‌­ రెడ్డి హాజరయ్యారు. అయితే, అధికార హోదా లేకున్నా ఆయన ఈ సమావేశంలో పాల్గొనడంపై మంత్రులు బీసీ జనార్ధన్‌ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సీఎంఓకు ఫిర్యాదు చేస్తూ, దీనిపై విచారణ జరిపించాలని కోరారు.

ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్ అధికారులు ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నారు. సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరిత, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూమా విఖ్యాత్‌­ రెడ్డి వేదికపై కూర్చొని అధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment