పరోటా మాస్టర్ రోల్ కోసం స్పెషల్ ట్రైనింగ్

పరోటా మాస్టర్ రోల్ కోసం స్పెషల్ ట్రైనింగ్

తమిళ స్టార్ విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) తన 50వ చిత్రం ‘మహారాజా’ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు, ఆయన ప్రధాన పాత్రలో పాండిరాజ్‌(Pandiraj) దర్శకత్వం వహించిన మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత నిత్యామీనన్‌(Nithya Menen) హీరోయిన్‌గా నటిస్తుండగా, యోగి బాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పరోటా మాస్టర్‌గా స్పెషల్ ట్రైనింగ్
ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి పరోటా మాస్టర్‌(Parotta Master)గా కనిపించనున్నాడు. పాత్రకు నిజమైన నైపుణ్యం అందించేందుకు, ఆయన పరోటా తయారీపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. సత్యజ్యోతి ఫిలింస్‌ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్‌ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్‌ సేతుపతి ప్రతి సినిమాకూ తనదైన మార్క్‌ పెట్టడం తెలిసిందే. ఈ కొత్త పాత్రలో ఆయన నటన, లుక్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment