పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనలతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం బంగాళాఖాతంలో, 91 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నష్టం తక్కువే..
భూకంపం వల్ల జరిగిన నష్టం తక్కువే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంప కేంద్రం నగరానికి చాలా దూరంలో ఉండటంతో నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఉపరితలం నుండి 91 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం, స్వల్ప ప్రభావంతోనే ఉండే అవకాశం ఉందని తెలిపారు. 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి, కానీ ఇది ఆ లోతుకు చాలా ఎక్కువగా ఉండటంతో, పెద్దగా నష్టం జరగలేదని చెబుతున్నారు.
వరుస ప్రకంపనలతో భయాందోళన
ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3:24 గంటలకు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో 2.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇది 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు సీస్మోలజీ కేంద్రం ప్రకటించింది. ఫిబ్రవరి 17 ఉదయం ఢిల్లీలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించగా, ధౌలా కువాన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఇవాళ ఉదయం 5:36 గంటలకు జరిగిన ఈ ప్రకంపనలు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) అంతటా కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.