తమన్నా (Tamannaah) ప్రధాన పాత్రలో అశోక్తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల 2’ (Odela 2) తాజాగా టీజర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి. మధు నిర్మాణంలో సంపత్ నంది టీమ్ వర్క్స్ మరియు మధు క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఓదెల సినిమా బృందం మహాకుంభమేళాకు వెళ్లి మూవీ టీజర్ను విడుదల చేసింది. టీజర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే దృశ్యాలతో ఆకట్టుకుంటోంది. సస్పెన్స్, థ్రిల్, రౌద్రం మిళితమైన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. తమన్నా లుక్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. టీజర్ లాంచ్కు ముందు ఓదెలా 2 టీమ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించింది.