తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ. 1554.99 కోట్ల అదనపు సాయాన్ని మంజూరు చేసింది. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు కేటాయించింది.

ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న ఈ రాష్ట్రాలకు కేంద్రం కేటాయించిన మొత్తం రూ.1554.99 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 608.08 కోట్లు, తెలంగాణకు రూ. 231.75 కోట్లు, త్రిపుర రాష్ట్రానికి రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్ రాష్ట్రానికి రూ. 170.99 కోట్లుగా కేటాయించింది.

గతేడాది సంభవించిన వరదలు, కొండ చరియలు విరిగిపడటం వంటి విపత్తుల కారణంగా రాష్ట్రాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో కేంద్ర బృందాలు వాటి ప్రభావాన్ని సమీక్షించి, అదనపు సాయం ప్రకటించింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో SDRF కింద మొత్తం 27 రాష్ట్రాలకు రూ. 18,322.80 కోట్లు, NDRF కింద 18 రాష్ట్రాలకు రూ. 4,808.30 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment