గుంటూరు రోడ్ల నిండా జనసందోహమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ కాన్వాయ్తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జగన్ రాకతో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో వాళ్లకు మద్దతుగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్ మిర్చియార్డుకు చేరుకొని రైతులతో మాట్లాడారు. మిర్చి పంటను పరిశీలించారు.
మిర్చి రైతులతో జగన్..
అయితే, వైఎస్ జగన్ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పర్యటనకు అనుమతి ఇవ్వబోమని అధికారులు చెప్పారు. అయినా ముందస్తుగా ప్రకటించిన కార్యక్రమం కావడం, గుంటూరు యార్డ్లో మిర్చి రైతులు గిట్టుబాటు ధర పతనమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుండంతో వైఎస్ జగన్ తన పర్యటనను కొనసాగించారు. అధికారులు అనుమతి నిరాకరించినా.. అన్నదాతలు జగన్ రాకను స్వాగతించి, వారి సమస్యలను చెప్పుకున్నారు.
లౌడ్ స్పీకర్లలో అనౌన్స్మెంట్లతో ఆటంకం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా గుంటూరు రహదారులపై పోలీస్ ఆఫీసర్లే కనిపించలేదు. కనీసం ట్రాఫిక్ కూడా క్లియర్ చేయలేదు. వైసీపీ కార్యకర్తలు, నాయకులే ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా, జగన్ కాన్వాయ్ ముందుకు కదిలింది. గుంటూరు యార్డ్లో కనీసం పోలీస్ కానిస్టేబుల్ కూడా కనిపించకపోవడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రికి జెడ్ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైగా వైఎస్ జగన్ రైతులతో జగన్ మాట్లాడకుండా అడ్డుకునేందుకు లౌడ్ స్పీకర్లతో పోలీసులు భారీ అనౌన్స్మెంట్లు చేసి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.