భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇదే సరైన సమయమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ అభిప్రాయపడ్డారు.
2036 ఒలింపిక్స్ హోస్టింగ్ కోసం భారత ప్రభుత్వం బిడ్ వేయనున్నట్లు ఆమె తెలిపారు. ఒకవేళ భారత్ ఈ బిడ్డింగ్లో విజయం సాధిస్తే, చరిత్రలోనే అత్యంత పచ్చదనంతో కూడిన (“Greenest Olympics”) ఒలింపిక్స్ను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ నిర్వహణ భారతదేశం కోసం గొప్ప అవకాశమని, ఇది క్రీడా మైదానంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలదని ఆమె అన్నారు.








