ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఆప్ ఓటమిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితే కారణమన్నారు. బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయానికి కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసిందని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. మంత్రి సురేఖ వార్తలను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ.. ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిపించారు. వెల్ డన్ అంటూ కేటీఆర్ తన ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.